
సినిమాలు

సూర్య తాజా చిత్రం ‘కరుప్పు’ను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేయగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బలంగా రాబడుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర ఏరియాలో రాయలసీమ మినహా ఈ సినిమాను 3 కోట్ల అడ్వాన్స్పై డీల్ చేసినట్లయితే దాదాపు 6 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ టాక్. ఈ ప్రభావంతో సూర్య నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా భారీ డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!