
రాజకీయాలు

అథర్వ మురళి, కయాదు లోహర్ జంటగా నటించిన ‘ఇదాయం మురళి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రీతి ముకుందన్ డ్యాన్స్, నటన తనకు ఎంతో నచ్చాయని ఆయన చెప్పారు. గతంలో తన సినిమాలో ఒక పాత్ర కోసం ఆమెను సంప్రదించినప్పటికీ, అప్పటికే ‘ఇదాయం మురళి’ చిత్రానికి కమిట్ కావడంతో ఆ అవకాశం సాధ్యపడలేదని వెల్లడించారు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేస్తామని కూడా తెలిపారు.
ఇక కయాదు లోహర్ నటనపై కూడా అట్లీ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించిందని, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో ఆకట్టుకుందని అన్నారు. త్వరలోనే కయాదు దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్గా గుర్తింపు పొందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. స్టార్ దర్శకుడి ప్రశంసలతో ఇద్దరు హీరోయిన్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!