

టాలీవుడ్ సంక్రాంతి సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాజా సాబ్” సినిమా భారీ విజయాన్ని సాధిస్తోంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు ఈ సినిమాను ఎంతో ఆస్వాదిస్తున్నారు. ప్రభాస్ చేసిన విభిన్న నటన, హారర్ ఫాంటసీ నేపథ్యంతో దర్శకుడు మారుతి కొత్తగా చూపించిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ, “సంక్రాంతి సెలవులు పూర్తిగా మొదలవకముందే సినిమా 200 కోట్ల మార్క్ను దాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు సినిమా నచ్చడంతోనే ఇంత మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త తరహా సైకలాజికల్ అంశాలు ఉండటంతో ప్రేక్షకులకు పూర్తిగా చేరడానికి కొంత సమయం పడుతుందని ముందే అనుకున్నాం. ప్రభాస్ గారు కూడా అదే చెప్పారు. ఇటీవల కొన్ని సీన్లు జోడించిన తర్వాత ఆయన నుంచి మంచి స్పందన వచ్చింది” అని తెలిపారు. కథలో బొమన్ ఇరానీ పాత్ర వచ్చిన తర్వాత సినిమా మలుపు తిరుగుతుందని, సాధారణ హారర్ కాకుండా ఫాంటసీ, సైకలాజికల్ అంశాలతో పెద్ద స్థాయిలో సినిమా తీశామని చెప్పారు.
ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను మరింతగా ఆస్వాదిస్తున్నారని మారుతి చెప్పారు. “మొదటిసారి చూసేటప్పుడు కొన్ని అంశాలపై దృష్టి ఉంటుంది. రెండోసారి చూస్తే సీన్ల లోతు అర్థమవుతుంది. ప్రభాస్ గారు ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారు. అభిమానులు, సినీ పరిశ్రమ నుంచి మంచి అభినందనలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రతి సినిమాకూ వస్తాయి, కానీ సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. ఈ సినిమా నాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రేక్షకులు సంతోషంగా ఉంటే అదే నాకు పెద్ద బహుమతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి” అని ఆయన తెలిపారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!