

‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ప్రేక్షకుల ముందుకు ‘బ్యాండ్ మేళం’ తో రాబోతోంది. బ్లాక్బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో, సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ చిత్రం వచ్చే నెల 13 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ‘తిప్పూ కుంటానవ్’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండో సింగిల్గా ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ పాటను మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. విడుదల అనంతరం ఆయన టీంకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మెలోడీ సాంగ్కు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించగా, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గీతరచయిత చంద్రబోస్ సాహిత్యం రాశారు. శ్వేతా మోహన్ తన మధురమైన స్వరంతో ఈ పాటను ఆలపించారు. లిరికల్ వీడియోలో హర్ష్ రోషన్, శ్రీదేవి స్కూల్ యూనిఫార్మ్లో కనిపిస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా కనిపిస్తున్నారు. సునీల్ సున్నాపు, ఫాల్గుణి బంగేరా రూపొదించిన హుక్ స్టెప్పులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా, శివ ముప్పరాజు ఎడిటింగ్ మరియు స్క్రీన్ప్లేను చూసుకున్నారు. సినిమాటోగ్రఫీని సతీష్ ముత్యాల నిర్వహించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!