

సినిమా అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదు. సమాజంలోని వాస్తవాలను, రాజకీయ, సామాజిక, మానవ హక్కుల అంశాలను ప్రతిబింబించే శక్తివంతమైన మాధ్యమం కూడా. అయితే జాతీయ భద్రత, రాజకీయ వివాదాలు, మతపరమైన అంశాలు, అసభ్యకర దృశ్యాలు, హింస లేదా కోర్టు కేసుల కారణంగా భారతదేశంలో పలు సినిమాలు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు ఎదుర్కొన్నాయి. కొన్ని చిత్రాలు మార్పుల అనంతరం విడుదల కాగా, మరికొన్ని ఇప్పటికీ థియేటర్లలో విడుదల కాలేదు.
వివాదాలకు గురైన ప్రముఖ చిత్రాల్లో 'సత్లుజ్' (2026), 'ఇండియాస్ డాటర్' (2015), 'ది పింక్ మిర్రర్' (2004), 'బందిపోటు రాణి' (Bandit Queen), 'బ్లాక్ ఫ్రైడే' (2004), 'ఫైనల్ సొల్యూషన్' (2004), 'పాంచ్' (2003), 'ఫైర్' (1996), 'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్' (1996), 'కిస్సా కుర్సీ కా' (1978), 'ఆంధీ' (1975) వంటి చిత్రాలు ఉన్నాయి. జాతీయ భద్రత, రాజకీయ పరిస్థితులు, కోర్టు ఆదేశాలు, మతపరమైన సున్నిత అంశాలు, హింస, శృంగార కంటెంట్ వంటి కారణాలతో ఈ చిత్రాలు భారత సెన్సార్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!