
జనరల్

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో వరుస విజయాలు సాధించిన ఈ సంస్థ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ధనుష్–సిరుతై శివ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ను దాదాపు ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే శింబు–కీర్తి సురేష్, శివకార్తికేయన్–జగన్ శక్తి కాంబినేషన్లలో కూడా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే కోలీవుడ్లో మైత్రి మూవీ మేకర్స్కు మరింత బలమైన గుర్తింపు లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!