
బిజినెస్

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రబృందం మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంశాన్ని ప్రోత్సహించడం తమ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. రేపు థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో నటీనటులు సినిమా కథ, టెక్నికల్ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి మాట్లాడారు. ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయాలనుకునే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలను హాస్యంతో చూపించినట్లు తెలిపారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని చిత్రబృందం కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!