.webp&w=3840&q=75)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొనగా, మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన స్పందనను అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను మలిచిన తీరు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను హరీష్ శంకర్ చూపించిన విధానం అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు కూడా చిత్రానికి బలంగా నిలిచాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించామని, వింటేజ్ పవన్ కళ్యాణ్ను చూపించడమే లక్ష్యమని తెలిపారు. సినిమాలో అక్రమ వలసదారుల అంశాన్ని ప్రస్తావించడం ప్రత్యేకతగా నిలిచిందని, ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దామని చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ తక్కువ సమయంలో అద్భుతమైన సంగీతం అందించారని, మొత్తం టీమ్ కృషితోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లో కూడా చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి షోకు టాక్, కలెక్షన్స్ పెరుగుతుండటం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఈ సినిమాను పండగలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నారని, హరీష్ శంకర్ బాధ్యతగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ సినిమా దీర్ఘకాలం రన్ సాధించి భారీ వసూళ్లు రాబడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, గీత రచయిత చంద్రబోస్ చిత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, టీమ్ సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.

.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!