

సినిమా టికెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టికెట్ ధరలను పెంచాలంటే సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలపై ప్రభావం పడుతుందని సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రస్తుతం టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటివరకు అమలులో ఉన్న విధానాన్నే కొనసాగించాలని సూచించింది. దీంతో త్వరలో విడుదల కాబోయే సినిమాలకు ఊరట లభించడంతో పాటు ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపుకు అవకాశం ఏర్పడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!