

మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్ పేరుతో హైదరాబాద్లో 10,017 ఇళ్లు కూల్చివేయబోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ అమలైతే లక్షలాది మంది పేదలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభావిత కుటుంబాల పునరావాసంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరాన్లో మిస్సైల్స్ కారణంగా ఇళ్లు కూలుతున్నప్పుడు, ఇక్కడ మాత్రం బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధమైందా అని ప్రశ్నించారు. బాపూఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డీపీఆర్ సిద్ధం చేయడానికి 18 నెలల సమయం పడుతుందని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని, అప్పుడు పేదల ఇళ్లను కూల్చేందుకు నోటీసులు ఎలా ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!