
టెక్నాలజీ

ఎల్పీజీ కొరత నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడటంతో పాటు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలో నిన్న దేశవ్యాప్తంగా సుమారు 6 వేల ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, తెలంగాణలోనే 1000 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు పేర్కొంది.
ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. ఎల్పీజీకి బదులుగా పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలని, అవసరమైతే కిరోసిన్, బొగ్గు పొయ్యిలను కూడా వినియోగించుకోవాలని తెలిపింది. అదేవిధంగా రాష్ట్రాలకు తగినంత బొగ్గు నిల్వలు అందించేందుకు సింగరేణి కాలరీస్ను ఆదేశించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!