
టెక్నాలజీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఒమన్, మలేషియా, ఫ్రాన్స్ దేశాల నాయకులతో యుద్ధ పరిస్థితులపై ఆయన విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో జరిగిన సంభాషణలో ప్రాంతీయ భద్రత, ప్రస్తుత పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా శాంతి, స్థిరత్వం సాధించడానికి చర్చలు మరియు దౌత్య మార్గమే ఉత్తమ పరిష్కారమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో త్వరితగతిన శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నాయకులతో ఆయన చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!