

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను మేకర్స్ ఖండించినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారమే ‘స్పిరిట్’ 2027 మార్చి 5న థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. షూటింగ్ కూడా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నట్లు సమాచారం.
‘స్పిరిట్’లో ప్రభాస్ తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్తో పాటు ఎమోషన్, బలమైన క్యారెక్టరైజేషన్కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టాక్. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టడంతో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!