

ఎస్సెస్ దుష్యంత్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ డ్రామా గాథ వైభవంను సునీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన దీపక్ తిమ్మప్పతో కలిసి సునీ సినిమాస్ మరియు సర్వేగర సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. నవంబర్ 14 న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేమ, విధి, భక్తి, భావోద్వేగాలతో నిండిన శాశ్వత ప్రేమగాథగా రూపుదిద్దుకుంది. తెలుగులో ఈ సినిమా హక్కులను ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దక్కించుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు విదేశాల్లో కూడా, ముఖ్యంగా ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల కానుంది. నాలుగు యుగాల కథతో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సన్నివేశాలతో విజువల్ ట్రీట్గా నిలవనుంది. విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీని, జూడా సాంధీ సంగీతాన్ని అందించారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!