

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రానున్న ఏఏ23 ప్రాజెక్ట్పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిలిచిపోయిందని, సమస్యలు ఎదురవుతున్నాయని వచ్చిన వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. చిత్రానికి సంబంధించిన ప్రాథమిక పనులు సజావుగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం కథను బలోపేతం చేయడంతో పాటు కీలక పాత్రల రూపకల్పన జరుగుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఏఏ23 చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు ఉన్నాయి. లోకేష్ కథకు బన్నీ పూర్తి ఆమోదం తెలిపినట్లు సమాచారం. 2027 విడుదల లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!