
D/O ప్రసాద్ రావు కనబడుటలేదు విడుదలైన కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేసి డిజిటల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. జీ5 లో ప్రసారమవుతున్న ఈ భావోద్వేగ ఉత్కంఠభరిత కథ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుని విస్తృత చర్చకు దారితీసింది.
తండ్రి – కూతురు మధ్యనున్న ఆత్మీయ అనుబంధమే ఈ కథకు ప్రధాన బలం. రాజీవ్ కనకాల, ప్రసాద్ రావు పాత్రలో తన గాఢమైన నటనతో ఆకట్టుకోగా, వసంతిక కూతురు పాత్రలో భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించారు. ఉదయ భాను తన ప్రభావవంతమైన తెర ప్రదర్శనతో కథనానికి మరింత బలం చేకూర్చారు.
రచన, దర్శకత్వం వహించిన పొలూరు కృష్ణ ఉత్కంఠతో కూడిన కథనాన్ని ప్రేక్షకులకు అందించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సిరీస్ మౌఖిక ప్రచారంతో పాటు డిజిటల్ వేదికలో స్థిరమైన ఆదరణను పొందుతూ ప్రాంతీయ ఓటీటీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!