

నిన్న రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం సీక్వెల్గా భారీ హైప్తో రిలీజ్ అయింది.
నార్త్తో పాటు సౌత్ మార్కెట్లో కూడా ‘ధురంధర్ 2’కు సంబంధించిన క్రేజ్ విపరీతంగా కనిపించింది. అయితే ప్రాంతీయ భాషల్లో విడుదల వాయిదా పడడంతో కొంతమంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ‘ధురంధర్ 2’ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే విజయ్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోలు కూడా ఈ సినిమాకు మద్దతుగా ఎక్స్ (Twitter)లో స్పందించారు.
అయితే అదే సమయంలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మాత్రం ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై ఒక్క ట్వీట్ కూడా రాకపోవడంతో పవన్ అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పరభాషా చిత్రాలను ప్రోత్సహించడం మంచిదేనని, అదే ఉత్సాహం మన సొంత హీరోలు మరియు సినిమాల పట్ల కూడా చూపిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.








.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!