

దేశవ్యాప్తంగా థియేటర్లలో ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజే ఈ సినిమా సంచలనం సృష్టించింది. భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం మొదటి రోజే గణనీయమైన కలెక్షన్లు సాధించింది. అయితే, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా పైరసీకి గురైనట్లు సమాచారం. భారత్లోనే కాకుండా పాకిస్థాన్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన పైరసీ కాపీలు ఇంట్లో టీవీల్లో వీక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాస్తవానికి ‘ధురంధర్’ సినిమాను పాకిస్థాన్లో నిషేధించారు. అయినప్పటికీ తొలి భాగాన్ని అక్కడి ప్రేక్షకులు అనూహ్యంగా వీక్షించారు. తాజాగా విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ను కూడా పైరసీ ద్వారా చూస్తున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్లో నిషేధం ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించకుండా ఆపలేకపోయినట్లు పేర్కొనబడింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పైరసీ వెర్షన్ పాకిస్థాన్లో ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఆసక్తిగల ప్రేక్షకులు VPN వంటి మార్గాల ద్వారా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని పాకిస్థానీ జర్నలిస్ట్ ఖాలిద్ మెహమూద్ ఖాలిద్ తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు. తాను లాహోర్లో ఈ సినిమా చూస్తున్నానని పేర్కొంటూ స్క్రీన్ క్లిప్ను కూడా పంచుకున్నారు. “లాహోర్లో ధురంధర్ 2 చూస్తున్నాను” అని ఆయన పోస్ట్ చేశారు. ఈ ఘటనపై చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక పాకిస్థాన్లో కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా చూస్తున్నారన్న విషయంపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. “ధురంధర్-2 థియేటర్లలో విడుదలైంది, పాకిస్థానీ: VPN ఆన్ కరో” అనే మీమ్ ప్రస్తుతం విస్తృతంగా షేర్ అవుతోంది.







.jpg&w=3840&q=75)









.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!