
సినిమాలు

బిహార్లోని బాంకీపుర్ ఉప ఎన్నిక ఫలితాల సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాల కోసం దాదాపు 200 కిలోల లడ్డూలు సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి ఎన్నికల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.
మధ్యాహ్నం 1 గంటల సమయంలో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ బీజేపీ అభ్యర్థిపై 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలోకి రావడంతో లడ్డూల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు సంబరాల కోసం సిద్ధం చేసిన లడ్డూల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి మీమ్స్కు కారణమయ్యాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!