
బిజినెస్

విడుదలకు సిద్ధమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, గేయరచయిత అనంత శ్రీరామ్, నిర్మాత శ్రీనివాస్ కుమార్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రంలోని ఒక పాటను విడుదల చేసినట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు.
తిరుమల నుంచే సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం తమకు ఎంతో ప్రత్యేకమని చిత్ర బృందం పేర్కొంది. నిర్మాత శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం జూలై 24న విడుదల కానుందని తెలిపారు. గేయరచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ చిత్రంలోని అన్ని పాటలను తానే రాశానని, శ్రీవారి ఆశీస్సులతో ఈ పాటలకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!