

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో సంకేతాత్మక పోస్టుతో ఉత్కంఠ పెంచారు. "ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు భారీ ప్రకటన" అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్గా మారింది. పోస్టులో నెమలి గుర్తు ఉండటంతో ఇది పౌరాణిక చిత్రానికి సంబంధించిన సంకేతమని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం 'గాడ్ ఆఫ్ వార్' అనే తాత్కాలిక పేరుతో ప్రచారంలో ఉంది. గతంలో నాగవంశీ పంచుకున్న సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన శ్లోకం, తాజాగా సంగీత దర్శకుడు థమన్ కూడా నెమలి గుర్తుతో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే గతంలో ఎన్టీఆర్ చేతిలో కనిపించిన 'మురుగా – యుద్ధ దేవుడు, జ్ఞాన స్వరూపుడు' అనే పుస్తకం కూడా ఈ సినిమా కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి ఇతివృత్తంతో తెరకెక్కుతుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే చిత్రంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!