

నందమూరి బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2 తాండవం’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై కొనసాగుతున్న ఆర్థిక సమస్యల కారణంగా గత రెండు రోజులుగా ఈ చిత్ర విడుదలపై అనిశ్చితి నెలకొంది.
తాజాగా, సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలను టెక్నికల్ సమస్యల వల్ల రద్దు చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్లో ప్రత్యేక పోస్టు రూపంలో వెల్లడించారు.
పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5 న విడుదలయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, బాలయ్య తాండవం చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో విడుదల వాయిదా పడటం అందరికీ నిరాశ కలిగించింది.
అనివార్య కారణాల వల్ల అఖండ-2 నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఈ నిర్ణయం వల్ల కలిగిన నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాం. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ అసౌకర్యానికి క్షమించాలి. కొత్త విడుదల తేదీని అత్యంత త్వరలో తెలియజేస్తాం అని నిర్మాణ సంస్థ ప్రకటించింది.




















కామెంట్స్ (1)
అఖండ-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.