

బాలీవుడ్లో మరో ఆసక్తికరమైన జోడీ తెరపై సందడి చేయబోతున్నట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారిగా కలిసి నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సూపర్నేచురల్ థ్రిల్లర్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభించేలా నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీని దృష్టిలో పెట్టుకునే కథను రూపొందించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హారర్, మిస్టరీ, మానసిక అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కనికా ధిల్లాన్కు ఇప్పటికే రచయిత్రిగా మంచి గుర్తింపు ఉంది. మన్మర్జియాన్, కేదార్నాథ్, జడ్జిమెంటల్ హై క్యా, హసీన్ దిల్రూబా, రష్మీ రాకెట్, రక్షా బంధన్, డంకీ వంటి చిత్రాలకు ఆమె కథలు అందించారు. నిర్మాతగానూ దో పట్టి వంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా హసీన్ దిల్రూబా, ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల్లో నమ్మకం సంపాదించారు. ఇప్పుడు దర్శకురాలిగా ఆమె తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!