

ప్రస్తుతం సినిమా నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. హీరోల పారితోషికాలు, ప్రొడక్షన్ ఖర్చులు, పాన్ ఇండియా ట్రెండ్ వంటి కారణాలతో బడ్జెట్ నియంత్రణ తప్పుతోంది. నిర్మాతలను ఆదుకోవాలనే మాటలు వినిపిస్తున్నా, కొందరు హీరోలు మాత్రం తమ డిమాండ్లతో అదనపు భారాన్ని మోపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. షూటింగ్కు ముందే హోటల్లు, సిబ్బంది ఖర్చులు, ప్రత్యేక సౌకర్యాలు తప్పనిసరిగా కావాలని చెప్పడం ఇప్పుడు సాధారణమైపోయింది.
ఇటీవలి కాలంలో కేరవాన్ కల్చర్ బాగా పెరిగింది. ఒకప్పుడు సెట్లో అందరూ కలిసి గడిపే వాతావరణం ఉండేది. ఇప్పుడు ఔట్డోర్ షూటింగ్లలో నటీనటుల కోసం ప్రత్యేక వానిటీ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. షూటింగ్లో భాగం వచ్చే వరకు కేరవాన్లోనే విశ్రాంతి తీసుకోవడంతో నటీనటుల మధ్య సాన్నిహిత్యం తగ్గిందనే అభిప్రాయం కూడా ఉంది.
ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ చిత్రం ధురంధర్ భారీ విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రణ్వీర్ కోసం నిర్మాతలు మూడు వానిటీ వ్యాన్లు ఏర్పాటు చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎండ్ క్రెడిట్స్లో హమ్జా వాన్, హమ్జా స్టాఫ్ వాన్, హమ్జా నార్మల్ వాన్ అని మూడు వాహనాలు కేటాయించినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నటనకు ప్రశంసలు అందుకున్న రణ్వీర్, సౌకర్యాల విషయంలో నిర్మాతపై అదనపు ఖర్చు పెట్టించాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారగా.. దీనిపై రణ్వీర్ అతని టీమ్ స్పందించాల్సి ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!