

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (ఆగస్టు 21) తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె మృతి చెందినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ ధ్రువీకరించారు.
షావుకారు జానకి సినీ ప్రస్థానం 1950లో విడుదలైన ‘షావుకారు’ అనే తెలుగు చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆమె. దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు.
భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో తరాల నటీనటులతో కలిసి పనిచేసిన షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.













కామెంట్స్ (1)
Rest in peace 🙏