
జనరల్

ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ను కలిశారు. ఉబర్ సీఈవో దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో సాంకేతికత, మొబిలిటీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై చర్చలు జరిగాయి.
పట్టణ రవాణా వ్యవస్థలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలపై కూడా విస్తృతంగా చర్చించారు. ప్రపంచ స్థాయి నాయకులతో ఆలోచనలు పంచుకోవడం ఎప్పుడూ కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నారా లోకేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!