
సినిమాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించింది.
కొత్త నిర్ణయం ప్రకారం సోమవారం, శుక్రవారం రోజుల్లో పూర్తిగా వర్చువల్ విధానంలో విచారణలు జరపనున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ కొనసాగుతుంది. కక్షిదారులు అవసరాన్ని బట్టి కోర్టుకు హాజరుకావచ్చని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సర్క్యులర్లో పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!