

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఇరుముడి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ స్పెషల్ సాంగ్ను ఆదివారం రాత్రి జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విడుదల చేశారు. ప్రముఖ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఆధారంగా రూపొందించిన ఈ పాటకు డప్పు శ్రీను గాత్రం అందించగా, చౌడం శ్రీనివాసరావు (వాసు) సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒరిజినల్ ట్యూన్ను కొనసాగించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
అయితే, ఒరిజినల్ పాటతో పోలిస్తే కొత్త వెర్షన్లో ఆ ఫీల్ కొంత తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుండగా, ఒరిజినల్ ఆల్బమ్ ఫ్లేవర్ను కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి థ్రిల్లర్కు డివోషనల్ టచ్ జోడిస్తూ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!