
జనరల్

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, భాజపా నేత తరుణ్ చుగ్ సహా మరో ఆరుగురు సభ్యులు సోమవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక నుంచి మళ్లీ ఎన్నికైన ఖర్గేకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన ఛాంబర్లో ప్రమాణం చేయించారు. పదవీకాలం ముగిసిన వెంటనే ఆయన తిరిగి ఎన్నికై ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.
ప్రమాణం అనంతరం ఖర్గే మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం తన బాధ్యత అని తెలిపారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఇండియా కూటమితో కలిసి పని చేస్తానని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపుర్, రాజస్థాన్ నుంచి ఇతర సభ్యులు కూడా ప్రమాణం చేశారు. కార్యక్రమంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!