
సినిమాలు

తెలంగాణలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 42 మంది మృతి చెందినట్లు సమాచారం. అందులో వరంగల్ జిల్లాలోనే 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా వంద మందికి పైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్త ప్రకటన జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!