
క్రీడలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు 623వ సమావేశంలో తీసుకున్నారు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం ఆమోదించబడింది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ నిధులు ప్రభుత్వానికి ఊరట కలిగించనున్నాయి.
ఆర్బీఐకు సెక్యూరిటీలపై వడ్డీలు, విదేశీ మారక లావాదేవీలు, సేవా రుసుములు వంటి మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో ఖర్చులు తీసివేసిన తరువాత మిగిలిన మొత్తాన్ని కేంద్రానికి డివిడెండ్గా చెల్లిస్తారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది అత్యధికం కాగా, 2024–25లో రూ.2.69 లక్షల కోట్లు, 2023–24లో రూ.2.10 లక్షల కోట్లు, 2022–23లో రూ.87,416 కోట్లు చెల్లించబడింది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!