
క్రీడలు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి (సీహెచ్ పురుషోత్తమ కుమార్)లకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా జరిగింది.
ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు పెరిగింది. కార్యక్రమానికి బార్ కౌన్సిల్ ప్రతినిధులు, అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు మరియు ఇతరులు హాజరయ్యారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!