
టెక్నాలజీ

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును గురువారం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవీదేవి ప్రకటించారు. ఈలోగా అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ ఇవ్వాలని భగీరథ్ తరపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని భగీరథ్ తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ, కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. గురువారానికి కాకుండా త్వరగా తీర్పు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిపై “చూద్దాం” అని స్పందించిన న్యాయమూర్తి, తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!