

కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ఆరోపించారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చి, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్గౌడ్తో కలిసి రామచందర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్లో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ పోరాటం కీలక పాత్ర పోషించిందని రామచందర్రావు అన్నారు. జనగామ జిల్లాకు ‘సర్దార్ సర్వాయి పాపన్న జనగామ’ అనే పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!