

ఇటీవల ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకం సైబర్ మోసం జరుగుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. ముఖ్యంగా ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
యాపిల్ సపోర్ట్ పేరుతో నకిలీ సందేశాలు పంపుతూ, ఫోన్ ఆన్ అయ్యిందని లేదా డేటా డిలీట్ అవుతుందని భయపెడుతున్నారు. ఆ సందేశాల్లో ఉన్న లింక్లపై క్లిక్ చేయగానే యాపిల్ లాగిన్ పేజీలాగే కనిపించే నకిలీ వెబ్సైట్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఇచ్చే యాపిల్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ వివరాలను నేరగాళ్లు దొంగిలిస్తున్నారు.
ఈ సమాచారం ద్వారా హ్యాకర్లు ఐక్లౌడ్ ఖాతాల్లోకి ప్రవేశించి “ఫైండ్ మై ఐఫోన్” ఫీచర్ను డిసేబుల్ చేస్తున్నారు. దీంతో ఫోన్ను సులభంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతోంది. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దని, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!