
ఆరోగ్యం

కడప జిల్లాలో నమోదైన కరోనా కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి మంత్రి సవిత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) రవిబాబుతో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. నమోదైన కేసులకు సంబంధించిన శాంపిళ్లను పుణెలోని ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపినట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కూడా అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!