
జనరల్

ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయు శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ 3-5 శాతం వరకు తగ్గుతున్న విషయం నిజమేనని అంగీకరించినా, ఈ విధానంపై వెనక్కు తగ్గబోమని స్పష్టం చేసింది. పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న నిర్ణయం కొత్తది కాదని, 2001 నుంచే ఈ ప్రణాళిక అమలులో ఉందని వెల్లడించింది.
దేశంలో ఇథనాల్ ఉత్పత్తి గతంలో తక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగిందని, కానీ ఇప్పుడు మౌలిక వసతులు విస్తరించడంతో ఉత్పత్తి పెరిగిందని తెలిపింది. ఈ దశలో ప్రాజెక్ట్ను ఆపితే పెట్టుబడులు, రైతులు, పరిశ్రమలు నష్టపోతాయని హెచ్చరించింది. ఈ20 పెట్రోల్ వల్ల ఇంజన్లు దెబ్బతింటాయన్నది తప్పుదారుణమని స్పష్టం చేస్తూ, ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఈ విధానాన్ని కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!