
వియత్నాంలో పర్యాటక పడవ ప్రమాదం అనంతరం అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారని తెలిపింది. బాధిత భారతీయుల కుటుంబాలకు సమాచారం, సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం, హనోయిలోని భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన పడవలో సుమారు 75 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది ఉన్నారని సమాచారం. ఓ కార్పొరేట్ సంస్థ డిస్ట్రిబ్యూటర్ల కోసం నిర్వహించిన విదేశీ పర్యటనలో భాగంగా వారు వియత్నాం వెళ్లినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలు అధికారిక హెల్ప్లైన్ నంబర్ల ద్వారా సమాచారం తెలుసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఈ క్రింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు:
+84 36 281 7930
+84 91552 37 14
+84 33 452 0414
అలాగే హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది..దీనిని +84 91 308 9165 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!