

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనతో పాటు ఇతర సభ్యులకు ప్రమాణం చేయించారు. మొత్తం 252 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు చంద్రబాబు, లోకేష్ మరియు ఇతర నేతలు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
పెద్దఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కేడర్ ఆధారిత పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలు నాయకులపై కన్నేసి ఉంచుతున్నారని, ఎవరి ప్రవర్తనైనా గమనిస్తున్నారని హెచ్చరించారు. అధికారం ఉందని ఇగోకు లోనవ్వొద్దని, కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. ఎన్డీఏలో భాగంగా ఐక్యతను కాపాడాలని, కేంద్రం మరియు రాష్ట్రానికి మచ్చ రాకుండా పని చేయాలని, ఈ స్పూర్తి గ్రామ స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!