
జనరల్

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదైన రోజైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమె మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు, చెంప భాగంలో కమిలిన గాయాలు, ఎడమ కాలిపై గాయం ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం.
వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తదుపరి న్యాయ ప్రక్రియలో భాగంగా బుధవారం ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిని హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!