
జనరల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలు చేస్తున్న ప్రజలపై పాక్ రేంజర్స్ కాల్పులు జరపడంతో 34 మంది మృతి చెందగా, 200 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో ప్రాంతంలో రవాణా, సమాచార వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించినట్లు తెలుస్తోంది.
ఆందోళనకారులపై బలగాలు కాల్పులు జరపడం పట్ల మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల నిరసనలను అణచివేసేందుకు బలప్రయోగం చేయడం సరికాదని విమర్శించాయి. పీవోకేలో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!