
జనరల్

విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి మానసిక (సైకోమెట్రిక్) పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశ్యం. అవసరమైన విద్యార్థులకు నిపుణుల ద్వారా కౌన్సెలింగ్, సహాయం అందించేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం వారి భవిష్యత్తుకు పునాది అని ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!