

శ్రీశైలంలోని సున్నిపెంటలో నూతనంగా నిర్మించిన దేవస్థానం సిబ్బంది నివాస గృహాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. క్వార్టర్ల నిర్మాణాలు నాణ్యంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగులు త్వరలో ఈ నివాసాల్లోకి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
శ్రీశైలం నుంచి సున్నిపెంటకు ఉద్యోగుల రాకపోకల కోసం దేవస్థానం బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం అభివృద్ధికి మరింత భూమి అవసరమని మంత్రి పేర్కొన్నారు. అటవీ శాఖ నుంచి నాలుగు వేల హెక్టార్ల భూమి కేటాయించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. దోర్నాల, అమ్రాబాద్ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ రహదారుల ఏర్పాటుపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!