

అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద సెల్ఫోన్, పెన్డ్రైవ్, ఛార్జర్, డైరీ లభ్యమైనట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సీసీబీ బృందం దాదాపు ఐదు గంటల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రేవణ్ణ బ్యారక్ నుంచి నీలిరంగు ఆండ్రాయిడ్ మొబైల్, పెన్డ్రైవ్, ఛార్జర్, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఖైదీ ప్రతాప్ రాయ్ వద్ద కూడా మొబైల్ లభించినట్లు జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ వెల్లడించారు.
జైలులోకి నిషేధిత వస్తువులు ఎలా చేరాయనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్ను సస్పెండ్ చేసింది. జైలు సూపరింటెండెంట్ అనుష్కుమార్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాగా, 2019లో ఓ మహిళ చేసిన లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2025 ఆగస్టు 2న రేవణ్ణను దోషిగా తేల్చి జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!