

హైదరాబాద్లో హెచ్ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ తదితర వ్యాధులపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సాగిన ర్యాలీలో సుమారు 1,500 మంది పాల్గొని హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి, నివారణ చర్యలు, పరీక్షలు, చికిత్సపై ప్రజలకు సరైన సమాచారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి వైద్య సేవలు, సహకారం అందించాలని సూచించారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. “సానుకూలంగా ఉండండి – హెచ్ఐవీ వ్యాప్తిని అడ్డుకుందాం” అనే నినాదంతో తెలంగాణను హెచ్ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!