
సినిమాలు

దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నెలలో సాధారణం కంటే 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. గత 125 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు కేవలం ఐదోసారి మాత్రమే నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. మధ్య భారతదేశంలో 56 శాతం, ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణ భారతంలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం మేర వర్షపాతం లోటు నమోదైంది.
వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో దేశంలోని 315 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. వీటిలో 111 జిల్లాలను 'అత్యంత అప్రమత్తత' జిల్లాలుగా గుర్తించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఈ జాబితాలో ఉండటంతో రైతులు, వ్యవసాయ రంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!