

డ్రగ్స్ విక్రయాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్-బీ అధికారులు అరెస్ట్ చేశారు. సూరారం-కొంపల్లి హైటెన్షన్ రోడ్డులో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్-బీ బృందం ఎస్సైలు బాలరాజు, సంధ్యలతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఇన్నోవా కారును నిలిపి తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో ప్రవీణ్ వద్ద బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 3.24 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించగా, ఎలిజర్ అలియాస్ సన్నీ వద్ద 36.90 గ్రాముల ఓజీ కుష్, 7.73 గ్రాముల చెరస్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు టయోటా ఇన్నోవా కారును కూడా అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.2.58 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!