
జనరల్

నటరాజన్ చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత టాటా సన్స్ ఛైర్మన్గా కొనసాగబోనని ప్రకటించడంతో, తదుపరి ఛైర్మన్ ఎవరనే చర్చ మొదలైంది. టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉన్న టీవీ నరేంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 1988లో టాటా గ్రూప్లో చేరిన నరేంద్రన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కొత్త ఛైర్మన్కు ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపారాలను బలోపేతం చేయడం ప్రధాన సవాళ్లుగా ఉండనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా నష్టాలు సుమారు రూ.22,238 కోట్లకు చేరగా, టాటా డిజిటల్ రూ.4,974 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉండగా, కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ప్రారంభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!