
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన ప్రజాప్రతినిధి జీవితంలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 4న మిడ్జిల్లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా తొలి విజయం సాధించిన ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే ప్రారంభమై, వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది.
తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగులో అండగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ సభను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరిన ఈ 20 ఏళ్ల ప్రయాణం ప్రజల విశ్వాసం, మద్దతుతోనే సాధ్యమైందని పేర్కొంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!