

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి 95 శాతం భూసేకరణ పూర్తయిందని పేర్కొంటూ, కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొంది వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఉత్తర, దక్షిణ భాగాల్లో ఒకేసారి పనులు ప్రారంభిస్తే నిర్మాణం వేగంగా పూర్తికావడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.
అలాగే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టుకు 12 లేన్ల రహదారి, మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-మంచిర్యాల ఆరు లేన్ల ప్రత్యామ్నాయ రహదారికి కూడా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!